ETV Bharat / state

ఏడాదిన్నరలోగా నెల్లికల్ లిఫ్టు పూర్తి చేస్తాం: సీఎం కేసీఆర్

author img

By

Published : Apr 14, 2021, 7:23 PM IST

గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా హాలియాలో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు.

Trs huge
సీఎం కేసీఆర్

ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలి: సీఎం కేసీఆర్

ఎవరెన్ని చెప్పినా... ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని నాగార్జునసాగర్​ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ​ ఉపఎన్నిక కోసం దిల్లీ నుంచి కేంద్రమంత్రులు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా హాలియాలో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. నోముల భగత్​కు వచ్చే ఓట్ల మాదిరే నెల్లికల్‌ లిఫ్టు నుంచి నీళ్లు దూకుతాయని చెప్పుకొచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చినట్లుగా ఏడాదిన్నరలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఎవరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో ప్రజలు గ్రహించాలని సూచించారు. మిత్రుడు నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

ఈరోజు నేను మిమ్మల్ని కలవకూడదని, ఈసభ జరగకూడదని చేయని ప్రయత్నం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో పూర్తిస్థాయిలో తలాతోక లేని వ్యవహారం. ఎవరైన సరే సభలు పెట్టుకుని ప్రజల్లోకి పోయి.. మంచి చెడ్డలన్నీ చెప్పి మమ్మల్ని సమర్థించమని అడుగుతరు. ఉర్ధూలో ఓ సామెత ఉంది. 'ముద్దిఇలాక్ బురా చాహితో క్యాహోతా? వహి హోతాహై జో మంజుర్ హై కుదా హోతాహై'. ముళ్ల చెట్టు పెట్టి నీరు పోస్తే పండ్లు కాయవు. మంచి చేసేవాళ్లని సమర్థిస్తే మనకు మంచి జరుగుతుంది.

-- హాలియా సభలో సీఎం కేసీఆర్

ఇదీ చదవండి: వీహెచ్ దీక్షకు మద్ధతు తెలిపిన సీపీఐ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.