ETV Bharat / state

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోలాహలం - అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 12:06 PM IST

Voter Registration Process
Graduate MLC by Election In Telangana

Graduate MLC by Election In Telangana : వరంగల్‌ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు డిసెంబరు 30న ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో అధికారికంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Graduate MLC by Election In Telangana : వరంగల్‌ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2021 మార్చిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా, 2027 ఏప్రిల్‌ వరకు పదవీ కాలం ఉంది. పల్లా రాజీనామాతో ఎమ్మెల్సీ సీటు ఖాళీ కావడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు.

పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!

Voter Registration Process in MLC by Election : డిసెంబరు 30న ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో అధికారికంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికకు నల్గొండ కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారిగా ఉండగా, అదనపు కలెక్టరు జె.శ్రీనివాస్‌ ఓటరు నమోదు అధికారిగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ కలెక్టరేట్‌లోనే ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.

ఫిబ్రవరి 18 వరకు ఓటరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండగా, ఏప్రిల్‌ 4న తుది ఓటరు జాబితాను వెల్లడించనున్నారు. ఈ ఎన్నిక ఏప్రిల్‌ చివరిలో గానీ, మే నెల మొదటి వారంలో గానీ ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులో నోటిఫికేషన్‌ వెలువడి, మార్చి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పక్కా : ఎంపీ లక్ష్మణ్

MLC by Election In Telangana : గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పోటీ చేయగా, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం, యువ తెలంగాణ తరఫున రాణి రుద్రమ దేవి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌ కుమార్‌) తదితరులు బరిలో నిలిచారు.హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గెలుపొందగా, రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న నిలిచారు.

తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గతంలో రెండో స్థానంలో నిలిచిన తీన్మార్‌ మల్లన్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరడంతో ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఆయనే బరిలో నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆచార్య కోదండరాంనకు సైతం ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయనను బరిలో నిలుపుతారా? అన్న చర్చ సాగుతోంది.

మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీ చేస్తారో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే స్వతంత్య్ర అభ్యర్థిగా నిలిచిన వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించే అవకాశం ఉంది తప్ప పార్టీ అధికారిక అభ్యర్థిగా ఎవరినీ బరిలో నిలపకపోవచ్చని పార్టీ సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్సీలుగా ముగ్గురు బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుముఖ పోటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.