ETV Bharat / state

'2 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభం సాధ్యమేనా?​'

author img

By

Published : Jul 9, 2019, 7:00 PM IST

విభజన హామీలపై పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ ఉత్తమ్​. గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన 2 కోట్ల నిధులతో ప్రారంభం సాధ్యమేనా అంటూ నిలదీశారు.

tribal university

విభజన హామీలపై పార్లమెంటులో గళమెత్తారు నల్గొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి. విభజన బిల్లులో ఇచ్చిన హామీలైన కాజీపేట్​లో రైల్వే​ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ అంశాలపై మట్లాడారు. గిరిజన యూనివర్సిటీకి గత బడ్జెట్​లో రూ.1 కోటి, ఈసారి మరో కోటి రూపాయలు కేటాయించారని... వీటితో యూనివర్సిటీ ప్రారంభం సాధ్యమేనా అని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేయాలని సభ ద్వారా హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

'2 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభం సాధ్యమేనా?​'

ఇవీ చూడండి;" ఐదు రూపాయల భోజనం ఎట్లుంది పెద్దాయన.."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.