ETV Bharat / state

రెండు ఆటోలు, ట్రాలీని ఢీకొట్టిన కారు... నలుగురికి గాయాలు

author img

By

Published : Jul 9, 2020, 7:57 PM IST

ఆగి ఉన్న రెండు ఆటోలు, ట్రాలీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చల్వాయిలో చోటుచేసుకుంది.

road accident in mulugu four persons were injured
కారు సృష్టించిన బీభత్సం.. నలుగురు వ్యక్తులకు గాయాలు

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న రెండు ఆటోలు, టాటా ట్రాలీని కోరుట్ల నుంచి వాజేడు వెంకటాపురం వైపు వెళ్తున్న ఓ కారు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఆటోలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులకి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: అద్దె అడిగాడని ఇంటి యజమానినే చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.