ములుగు జిల్లాలో రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చిన్న గంగారం వెళ్లే రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్న వాగు పొంగి పొరలుతోంది. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు వరదనీరుతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనితో భక్తులు వెనుతిరిగి వెళ్తున్నారు.
ఇవీ చూడండి: అయోధ్య మధ్యవర్తిత్వం నివేదికపై నేడు సుప్రీం విచారణ