ETV Bharat / state

మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు

author img

By

Published : Feb 4, 2020, 10:02 PM IST

అంబరమంటే సంబురానికి ముహూర్తం సమీపించింది. కీకారణ్యం జనారణ్యంగా మారే సమయం వచ్చేసింది. రేపట్నుంచి ఘనంగా ప్రారంభమయ్యే మేడారం జాతరకు భక్తుల రద్దీ అప్పుడే మొదలైంది.

మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు
మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు

మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు

తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతరలో భక్తుల సందడి అప్పుడే నెలకొంది. తెలంగాణ నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. జాతరలో తల్లుల దర్శనం కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారం చేరుకుంటున్నారు. డ్రోన్​ కెమెరా చిత్రీకరించిన గిరిజన జాతర అందాలు ఆకట్టుకుంటున్నాయి.

భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పర్యావరణం కాపాడేందుకు భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తీసుకొని రావద్దని అధికారులు ఇదివరకే విజ్ఞప్తి చేశారు. రేపట్నుంచి నాలుగు రోజుల పాటు జాతర కోలాహలంగా జరుగనుంది.

ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.