ETV Bharat / state

ప్రజలకు మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే వివేకానంద్​

author img

By

Published : Sep 30, 2020, 4:27 PM IST

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్​సీఎల్​ నార్త్ కాలనీలో రూ.10 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి మంచినీటి నల్లాను ఎమ్మెల్సీ శంభిపూర్​ రాజుతో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్​ ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజలకు మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే వివేకానంద్​
ప్రజలకు మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే వివేకానంద్​

మేడ్చల్​ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఎన్​సీఎల్​ నార్త్ కాలనీలో రూ.10 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి మంచినీటి నల్లాను ప్రారంభించారు.

ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే వివేకాంద్ పేర్కొన్నారు. కోట్ల నిధులతో గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా అనేక రిజర్వాయర్లు నిర్మిస్తూ మంచి నీటి సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

భవిష్యత్తులో హైదరాబాద్ నగర ప్రజల మంచి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేశవపురంలో 10 టీఎంసిల రిజర్వాయర్​కు త్వరలోనే ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుందన్నారు.

ఇదీ చదవండి: 'మణికొండలో మంచినీటి సమస్య తీరుస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.