ETV Bharat / state

Etela Rajendar Latest News : 'రైతుల భూములు లాక్కునేందుకే ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది'

author img

By

Published : Jul 15, 2023, 9:07 PM IST

Etala Suport to Bommarasi Peta Formers
Etala Suport to Bommarasi Peta Formers

Etala Fire on CM KCR : ధరణి పోర్టల్​ వల్ల మేడ్చల్​ జిల్లాలోని బొమ్మరాశిపేట రైతులు 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిని సీఎం కేసీఆర్​, కేసీఆర్​ బంధువులు, తాబేదారుల కబ్జా చేస్తున్నారని హూజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ భూములు కోల్పోయిన రైతులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

రైతులకు మద్దతు తెలిపిన ఈటల

Etela Rajendar Fire on Telangana Government : మేడ్చల్​ జిల్లాలోని శామీర్​పేట్ మండలం బొమ్మరాశిపేట రైతులకు హూజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ మద్దతు తెలిపారు. పోలీస్​ స్టేషన్​కి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్ల క్రితం భూములను కొనుక్కున్న 1050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని.. ఆ భూములను బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని గుర్తు చేశారు. మేడ్చల్​ కలెక్టర్​ కార్యాలయం దగ్గర ధర్నాకు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు రైతులను అరెస్ట్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత భూమి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆ సమస్యలు ఇంకా అలానే ఉంచారని మండిపడ్డారు.

Etela Comments on CM KCR : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచిన ధరణి పోర్టల్​ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. ధరణి వల్ల సాధారణ రైతులు వారి భూములను కోల్పోతున్నారని ఆరోపించారు. సర్వే నంబర్​ 323 నుంచి 409 వరకు 1050 ఎకరాల భూముల్లో 50 సంవత్సరాలుగా రైతులు పండ్ల తోటలు, కోళ్ల ఫారంలు పెట్టుకుని జీవిస్తున్నారని వివరించారు. మట్టిని నమ్ముకున్న రైతుల విషయంలో అన్యాయం చేస్తే ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు. ఓ పత్రికలో రైతులను దొంగలుగా రాసారని.. ఆ పత్రిక ఎవరి కోసం పని చేస్తుందో అందరికీ తెలుసని అన్నారు.

Farmers Protest at Thoguta MRO Office : మా చెక్కులిచ్చే వరకు కదిలేదు లేదు.. ఎమ్మార్వో ఆఫీస్​లో బైఠాయించిన రైతులు, ఎమ్మెల్యే

Etela Suport to Bommarasi Peta Formers : మధ్యవర్తుల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని కొంత మంది అన్నారని వెల్లడించారు. ఎంఆర్​ఓలు, ఆర్డిఓలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్​ స్పందించాలని పేర్కొన్నారు. ఈ సమస్యకి కలెక్టర్ స్పందించకపోతే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. బొమ్మరాశిపేట రైతులకు అండగా ఉండి పోరాడతారని తెలిపారు. ధరణిలో సమస్యల పరిష్కారం కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. వాటిపై వెంటనే సరైన చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

"శామీర్ పేట్ మండలం బొమ్మరాశిపేట గ్రామంలో సర్వే నెంబర్​ 323 నుంచి 409 వరకు 1050 ఎకరాల భూముల్లో 40 సంవత్సరాలుగా కూరగాయలు, పంటలు పండించుకొని జీవిస్తున్నారు. ధరణి పేరు చెప్పి కేసీఆర్​, కేసీఆర్​ బంధువులు, తాబేదారులు ఆ భూముల మీద కన్నేశారు. ఈ విషయంపై ధర్నా చేసేందుకు కలెక్టర్​ కార్యాలయంలో అనుమతి తీసుకున్నారు. దీంతో వారు ధర్నా చేస్తుండగా.. పోలీసులు తీసుకువచ్చారు. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. ఈ సమస్యను జిల్లా యంత్రాంగం పరిష్కరించాలని డిమాండ్​ చేస్తున్నాను. లేనిపక్షంలో పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హెచ్చరిస్తున్నాను." - ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.