గంగా జలాన్ని అందించిన మహాపురుషుడు భగీరథుడు, ఆయన మానవాళికి చేసిన మేలును స్మరించుకోవడం మన ధర్మమని జిల్లా కలెక్టర్ యస్. హరీశ్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు.
ఏటా వైశాఖ శుద్ధ సప్తమి రోజున నిర్వహించుకునే ఈ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని.. కాగా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వేడుకలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని అన్నారు.