ETV Bharat / state

వారు దిల్లీలో గులాంగిరి చేస్తారు: హరీశ్​ రావు

author img

By

Published : Feb 14, 2021, 6:25 PM IST

finance minister harish rao participated trs meeting in medak
వారు దిల్లీలో గులాంగిరి చేస్తారు: హరీశ్​ రావు

జాతీయ పార్టీలో పనిచేసే నాయకులంతా దిల్లీలో గులాంగిరి చేస్తారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. మెదక్​లో నిర్వహించిన తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

మెదక్​లో తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు. జాతీయ పార్టీలో పనిచేసే నాయకులంతా దిల్లీలో గులాంగిరి చేస్తారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ఉన్నాయన్నారు.

సభ్యత్వ నమోదును ఫిబ్రవరి 28లోపు పూర్తిచేసి ఆన్​లైన్​లో నమోదు చేయాలని కోరారు. కాంగ్రెస్ హాయంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. తిన్నది అరగక చేసుకున్నారని అన్నది ఆ పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. నేడు రైతు యాత్రల పేరుతో కుర్చీల కోసం యాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు.

వారు దిల్లీలో గులాంగిరి చేస్తారు: హరీశ్​ రావు

ఇదీ చదవండి: 'చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల గళం వినిపిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.