ETV Bharat / state

ఉద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం : రఘునందన్​రావు

author img

By

Published : Dec 14, 2020, 6:42 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, ఐఆర్ విషయంలో భాజపా పోరాటం కొనసాగిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. మెదక్​ కలెక్టరేట్​ ముందు భాజపా శ్రేణులు చేపట్టిన ధర్నా వద్దకు చేరుకుని కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా పెండింగ్​లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

bjp-demand-for-to-give-prc-and-ir-for-employees
ఉద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం : రఘునందన్​రావు

ఉద్యోగుల సమస్యలపై భాజపా నిరంతరం పోరాడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ వెంటనే అమలు చేయాలని మెదక్​ జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

రెండేళ్లుగా పెండింగ్​లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్​ చేశారు. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై భాజపా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం సన్నవరి ధాన్యంపై బంద్​కు పిలుపునిస్తే ఉద్యోగ సంఘాలు పాల్గొనడం బాధాకరమైన విషయమన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే వారికి భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని రఘునందన్​రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్​, పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:నియామక ప్రక్రియ వేగవంతం.. ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.