ETV Bharat / state

మెదక్‌ లో ఆటో, కారు ఢీ - ఐదుగురికి గాయాలు

author img

By

Published : May 14, 2020, 4:06 PM IST

Auto, car crash in Medak - five injured
మెదక్‌ లో ఆటో, కారు ఢీ - ఐదుగురికి గాయాలు

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోతంశెట్టిపల్లి చౌరస్తా నూతన బ్రిడ్జి వద్ద ఆటోను కారు ఢీ కొట్టింది. ప్రయాణికులతో సహా ఆటో మహబూబ్‌ కాలువలో పడిపోయింది.. ఈప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లి చౌరస్తా నూతన బ్రిడ్జి వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులతో సహా ఆటో మహబూబ్‌ కాలువలో పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం ఎలా జరిగిందంటే..?

పోతంశెట్టిపల్లి నుంచి మెదక్‌ వైపు వెళ్తున్న ఆటోను, మాచవరం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి పోతంశెట్టిపల్లి నూతన బ్రిడ్జి వద్ద ఢీకొంది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

క్షతగాత్రులను 108 వాహనంలో మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం కారులోని వారు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి: వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే: శాంతా బయోటెక్ ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.