ETV Bharat / state

కస్తూర్బా పాఠశాలలో కొవిడ్​ కలకలం.. ఏడుగురికి పాజిటివ్

author img

By

Published : Mar 1, 2021, 6:19 PM IST

Updated : Mar 1, 2021, 6:51 PM IST

7 STUDENTS ARE AFFECTED TO COVID POSITIVE IN KASTURBA SCHOOL IN MEDAK DISTRICT
కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్

17:26 March 01

కస్తూర్బా పాఠశాలలో కొవిడ్​ కలకలం.. ఏడుగురికి పాజిటివ్

మెదక్ జిల్లా ఝరాసంగం కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం రేగింది. కస్తూర్బా పాఠశాలలో ఏడుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధరించారు. ఇందులో ఆరుగురు విద్యార్థినిలు కాగా, ఒక ఆయా ఉన్నారు. వీరికి ర్యాపిడ్‌ టెస్టులో నెగిటివ్ వచ్చింది. కాని ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలింది.

కస్తూర్బా పాఠశాలలో ఇప్పటివరకు 19 మందికి కరోనా సోకింది. హోంక్వారంటైన్‌లో ఉన్న బాధితుల్లో ముగ్గురిలోనే కరోనా లక్షణాలు ఉన్నాయి. బాలికలకు కొవిడ్​ పాజిటివ్​ రావటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: ప్రతీ సాక్ష్యం కీలకమే.. వాటిని భద్రపరచండి: హైకోర్టు

Last Updated :Mar 1, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.