ETV Bharat / state

సింగరేణిలో ప్రమాదం... ఓ కార్మికుడు మృతి

author img

By

Published : Dec 16, 2019, 9:49 PM IST

ఓవైపు కార్మికుల రక్షణ కోసం వారోత్సవాలు జరుగుతుండగా... మరోవైపు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందటం వల్ల మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ సింగరేణి ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. గనిలో పని చేస్తుండగా... మల్లయ్య అనే కార్మికునిపై పైనుంచి టబ్బులు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

LABOUR DIED IN SRIRAMPUR SINGARENI AREA
LABOUR DIED IN SRIRAMPUR SINGARENI AREA

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే-6 గనిలో జనరల్ మజ్దూర్ కార్మికుడు చంద్రయ్య బొగ్గు తరలించే క్రమంలో ప్రమాదం జరిగింది. గనిలో పని చేస్తుండగా... పైనుంచి టబ్బులు ఆకస్మికంగా దూసుకు రావటం వల్ల మలుపు వద్ద పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కార్మికుడు మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఓవైపు సింగరేణిలో కార్మికుల రక్షణ కోసం వారోత్సవాలు జరుగుతుండగా... తొలిరోజే ఈ ఘటన జరగటం వల్ల అంతా విషాదంలో మునిగిపోయారు. మల్లయ్య మృతికి సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, రక్షణ చర్యలు తీసుకుని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.

సింగరేణిలో ప్రమాదం... ఓ కార్మికుడు మృతి

ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత

ఫైల్ నేమ్ : TG_ADB_11_14_SINGARENI KARMIKUDU MRUTHI_AV_TS10032 రిపోర్టర్: సంతోష్ మైదం, మంచిర్యాల. (); మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఆర్కే 6 గనిలో ప్రమాదం. జనరల్ మజ్దూర్ కార్మికులు చంద్రయ్య బొగ్గు తరలించే టబ్బులు మీద పడి మృతి చెందాడు. గనిలో విధులు నిర్వర్తిస్తున్న మల్లయ్య పై టబ్బులు పైనుంచి గనిలోకి ఆకస్మికంగా దూసుకు రావడంతో మలుపు వద్ద పనిచేస్తున్న కార్మికుల పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు సింగరేణిలో కార్మికుల రక్షణ కోసం వారోత్సవాలు జరుగుతుండటం తొలిరోజే ఈ విధంగా ప్రమాదానికి గురై కార్మికులు మృతి చెందిన పై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుడి మృతికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, రక్షణ చర్యలు తీసుకుని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి కార్మికులు డిమాండ్ చేశారు. బైట్: సైదా బాజీ, ఏ ఐ టి యు సి కార్మిక నాయకుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.