ETV Bharat / state

విద్యా శాఖ అధికారులతో కలెక్టర్​ వెంకట్​రావు సమావేశం

author img

By

Published : Oct 16, 2020, 7:20 PM IST

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్​ వెంకట్​రావు అన్నారు. మహబూబ్​నగర్ కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు.

mahabubnagar collector venkatrao meeting with education officers
విద్యా శాఖ అధికారులతో కలెక్టర్​ వెంకట్​రావు సమావేశం

ఇష్టానుసారంగా ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్​ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్​ వెంకట్​రావు హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్​ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్​ను రద్దు చేస్తామని హెచ్చరించారు.

జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్​ ఆదేశించారు. పాఠశాలలను తిరిగి ప్రారంభించేటప్పుడు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ పూర్తిగా శుభ్రం చేయాలని వెంకట్​రావు సూచించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమం గురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని, పాఠశాలలో నషా ముక్త్ భారత్ క్లబ్ల్​ను ఏర్పాటు చేయాలని, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని, మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే నష్టం గురించి వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.

ఇదీ చదవండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.