ETV Bharat / state

పాలమూరులో నిరాడంబరంగా గణేశ్​ నిమజ్జనం

author img

By

Published : Aug 31, 2020, 7:16 AM IST

Ganesh immersion at mahabubnagar
పాలమూరులో నిరాడంబరంగా గణేశ్​ నిమజ్జనం

ప్రతి ఏడు కనులపండువగా సాగే గణపతి నిమజ్జనం వేడుకులు ఈఏడాది.. కరోనా మహమ్మారి కారణంగా అశేష భక్తజనం పాల్గొనలేకపోయింది. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో కొవిడ్​ కారణంగా పరిమితి సంఖ్యలో గణనాథులను ప్రతిష్టించగా.. నిరాడంబరంగా నిమజ్జనాలను కొనసాగించారు.

లంబోదరా, ఏకందంతా శరణు, శరణు అంటూ మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తొమ్మిది రోజులుగా కొలిచిన భక్తులు గణపయ్యలను నిమజ్జనం చేశారు. వేడుకలలో కోలహలం లేకపోగా.. నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ.. పరిమతి సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాలమూరు పట్టణాన్ని పోలీసులు నిఘా నీడన ఉంచారు. ఈ ఏడు మెండుగా వర్షాలు కురవడం.. ఎక్కడికక్కడ కుంటలు, చెరువులు నిండుకుండడంతో అక్కడే నిమజ్జనాలు చేసేందుకు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: కేసీఆర్​ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.