ETV Bharat / state

అధిక విద్యుత్​ ఛార్జీలకు వ్యతిరేకంగా భాజపా నిరసన

author img

By

Published : Jun 15, 2020, 10:44 PM IST

మహబూబ్​నగర్​ జిల్లాలో విద్యుత్​ భవన్​ ఎదుట భాజపా ఆధ్వర్యంలో కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా భాజపా జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్​తో కలిసి మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి ధర్నా నిర్వహించారు. స్లాబ్​తో సంబంధం లేకుండా, గతేడాది బిల్లులతో సంబంధం లేకుండా ఇష్టానుసారం బిల్లులు వేశారని ఆరోపించారు.

former mp jitender reddy protest at mahabubngar electricity office
అధిక విద్యుత్​ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన

విద్యుత్​ ఛార్జీల విషయంలో సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి డిమాండ్​ చేశారు. స్లాబ్​తో సంబంధం లేకుండా, గతేడాది బిల్లులతో సంబంధం లేకుండా ఇష్టానుసారం బిల్లులు వేశారని ఆరోపించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్​తో కలిసి విద్యుత్​ భవన్​ ఎదుట భాజపా ఆధ్వర్యంలో కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

విద్యుత్​ ఛార్జీల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఖరే ఈ అధిక ఛార్జిలకు కారణమని మాజీ ఎంపీ ఆరోపించారు. కరెంటు బిల్లుల విషయంలో తగిన న్యాయం జరిగే వరకు భాజపా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.