క్రీడలతో యువతలో స్నేహ భావాలు పెంపొందుతాయని మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట జడ్పిటిసి సభ్యురాలు భూక్య సంగీత అన్నారు. మండలంలోని పడమటి గూడెం గ్రామంలోని గ్యామా తండా యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని భూక్య సంగీత అన్నారు. జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన జడ్పిటిసి సభ్యురాలు క్రికెట్ ఆడి ఆటగాళ్లలో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకన్న, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : కడచూపు కోసం కన్నపేగు తల్లడిల్లుతోంది..!