ETV Bharat / state

డబ్బలు, సీసీ కెమెరాలు కొట్టేశాడు.. కానీ దొరికిపోయాడు..

author img

By

Published : Mar 12, 2020, 11:48 PM IST

thief even chori CC camera at mahabubabad
డబ్బలు, సీసీ కెమెరాలు కొట్టేశాడు.. కానీ దొరికిపోయాడు

చిన్న చిన్న చోరీలు చేసే ఓ వ్యక్తి ఓ రైస్​ మిల్లులో దొంగతనానికి వెళ్లాడు.. అక్కడ క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.15 వేలు తీసుకున్నాడు.. తర్వాత తానూ దొరకకూడదని సీసీ కెమెరాలను సైతం కొట్టేశాడు. చివరికి దొరికిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

గుడినే కాదు... గుడిలో ఉన్న లింగాన్ని కూడా దొంగిలించిన చందంగా ఉంది దొంగల తీరు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఈనెల 9న ఓ వ్యక్తి రాత్రి రైస్​ మిల్లులో దొంగతనానికి వెళ్లాడు. అక్కడ క్యాష్ కౌంటర్​లో ఉన్న రూ.15 వేల నగదు తీసుకున్నాడు. అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించి దొరకకూడదనే అభిప్రాయంతో వాటిని కూడా దొంగిలించాడు.

పోలీసులు అంబేడ్కర్ కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు. గతంలో కూడా వ్యవసాయ మార్కెట్​లో చిన్న చిన్న చోరీలకు పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ. 15 వేల నగదు, 30 వేల విలువ చేసే సీసీ కెమరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దొంగతనాలు చేసిన రవిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

డబ్బలు, సీసీ కెమెరాలు కొట్టేశాడు.. కానీ దొరికిపోయాడు

ఇదీ చూడండి : మండలిలో బడ్జెట్​పై చర్చ పూర్తి.. రేపు మంత్రి సమాధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.