ETV Bharat / state

కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై అధికారిణి తనిఖీ

author img

By

Published : Dec 29, 2020, 8:24 PM IST

వరిధాన్యం కొనుగోసు కేంద్రాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రాథమిక సహకార సంఘం సీఈవో రజిత తనిఖీ చేశారు. ధాన్యం తూకం వేశాక తక్కువగా వస్తున్నాయని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని మహబూబాబాద్ మండలం వేమునూరు గ్రామ రైతులు వాపోయారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

Official inspection of irregularities in purchasing centers in mahaboobabad dist
కొనుగోలు కేంద్రాల్లో అవతవకలపై అధికారిణి తనిఖీ

మహబూబాబాద్ మండలం వేమునూరు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఈవో రజిత పరిశీలించారు. ధాన్యం కాంటా వేశాక నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని రైతన్నలు ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేశాక బస్తాల తూకం తక్కువగా వస్తున్నాయని అన్నదాతలు వాపోయారు.

నిర్వాహకులు మాత్రం తేమ కారణంగా మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో రెండు విధాలుగా తాము నష్టపోతున్నామని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న భాజపా శ్రేణులు కొనుగోలు కేంద్రానికి వచ్చి ఆరా తీశారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి, రైతులకు న్యాయం చేస్తానని రజిత హామీ ఇచ్చారు. అనంతరం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిని తొలగించారు.

ఇదీ చూడండి: సీసీఐకి మంత్రి నిరంజన్​ రెడ్డి లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.