ETV Bharat / state

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ధర్నా

author img

By

Published : Jun 11, 2021, 4:15 PM IST

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకు వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Congress protest against petrol, disil rates in mahabubabad district
Congress protest against petrol, disil rates in mahabubabad district

పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని పెట్రోల్ బంక్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లీటర్ పెట్రోల్ రూ. 50, 60 ఉండగా, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాకా రూ. 100 దాటిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి విమర్శించారు. పెంచిన పెట్రోల్.. డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: షర్మిలకు చుక్కెదురు.. కాన్వాయ్​ను అడ్డుకున్న పోలీసులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.