ETV Bharat / state

కాగజ్​నగర్​లో క్షయ అధ్యయన శిబిరం ప్రారంభం

author img

By

Published : Feb 18, 2021, 12:09 PM IST

జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్షయ అధ్యయన శిబిరాన్ని కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​​లో... పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, పురపాలిక కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ అధ్యయనంలో క్షయ వ్యాధి బారిన పడిన వారిని గుర్తించి... వారికి ఉచితంగా వైద్యం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tuberculosis study camp begins in Kagaznagar town in komaram bheem district
కాగజ్​నగర్​ పట్టణంలో క్షయ అధ్యయన శిబిరం ప్రారంభం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో క్షయ అధ్యయన శిబిరాన్ని... పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, పురపాలిక కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. కేంద్రీయ క్షయ విభాగం, జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ... ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారంతో ఈ పరిశోధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో పట్టణంలో ఎంపిక చేసిన 4 వార్డుల ప్రజలకు పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Tuberculosis study camp begins in Kagaznagar town in komaram bheem district
కాగజ్​నగర్​ పట్టణంలో క్షయ అధ్యయన శిబిరం ప్రారంభం

ఈ అధ్యయనంలో శ్వాస సంబంధిత క్షయ వ్యాధి తీవ్రతను అంచనా వేయనున్నట్లు తెలిపారు. పరిశోధన జరిపిన సమూహాలలో ఛాతి నొప్పి లక్షణాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. క్షయ రోగులను గుర్తించి... వారికి ఉచితంగా వైద్యం అందించే ఏర్పట్లు చేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ పరీక్షల్లో పట్టణ వాసులు పాల్గొని సహకరించాలని కమిషనర్ శ్రీనివాస్ కోరారు.

Tuberculosis study camp begins in Kagaznagar town in komaram bheem district
కాగజ్​నగర్​ పట్టణంలో క్షయ అధ్యయన శిబిరం ప్రారంభం

ఇదీ చదవండి: ప్రభుత్వ సహకారంతోనే న్యాయవాద దంపతుల హత్య: సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.