కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పెంచికలపేట మండలం నుంచి కాగజ్నగర్ వైపు వెళ్తున్న బస్సు ఇస్గాం వద్ద బ్రేకు లైనర్లు పట్టుకోవడం వల్ల బస్ టైర్లు వేడెక్కి పొగలు వచ్చాయి. వెనుక వైపు కూర్చున్న ప్రయాణికులు అప్రమత్తం చేయగా బట్టుపల్లి చౌరస్తాలో బస్సును నిలిపివేశారు. బస్సు టైర్లపై నీళ్లు చల్లి పొగలను అదుపు చేశారు. సకాలంలో ప్రమాదాన్ని పసిగట్టడం వల్ల ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు