ETV Bharat / state

వాంకిడిలో జాతీయ రహదారిపై ఆదివాసీల ధర్నా

author img

By

Published : Dec 15, 2020, 8:57 PM IST

Updated : Dec 15, 2020, 10:52 PM IST

వాంకిడిలో జాతీయ రహదారిపై ఆదీవాసీల ధర్నా
వాంకిడిలో జాతీయ రహదారిపై ఆదివాసీల ధర్నా

ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీలు మరోసారి ఆగ్రహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములను కబ్జా చేసిన లంబాడీలను ఆ ప్రాంతం నుంచి పంపేయాలని డిమాండ్​ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా చేశారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివాసీలు ధర్నా చేశారు. లంజన్ వీర గ్రామ శివారులోని ఏజెన్సీ భూములను మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడీలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వారిని ఖాళీ చేయించాలని డిమాండ్​ చేశారు.

లంజన్ వీర గ్రామం వైపు ఆదివాసీలంతా ర్యాలీగా బయలుదేరగా... మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అంతర్​రాష్ట్ర రహదారిపై సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేపట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలు రాస్తారోకో నిర్వహించారు. ఆదివాసీల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: 'గల్లీలో చిందులు... దిల్లీలో విందులు..!'

Last Updated :Dec 15, 2020, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.