ETV Bharat / state

CM KCR Speech at Asifabad Public Meeting : ''ధరణి​'ని తీసేస్తే మళ్లీ పైరవీకారులు, లంచగొండుల రాజ్యం'

author img

By

Published : Jun 30, 2023, 6:35 PM IST

KCR
KCR

CM KCR Visit To Asifabad : వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్​ అంటుందని.. అలాంటి పార్టీకి పట్టం కడతారా అని సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్​ఎస్​ పార్టీనే రాబోతోందని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్​లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్​ పాల్గొని.. ఆసిఫాబాద్​ జిల్లాపై వరాల జల్లు కురిపించారు.

BRS Meeting In Asifabad : వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్​ఎస్​ పార్టీనే గెలవబోతోందని.. అందులో ఎలాంటి అనుమానం లేదని సీఎం కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్​ చెబుతోందని.. అలాంటి వారికి పట్టం కడతారా అని సీఎం ఆక్షేపించారు. కుమురం భీం ఆసిఫాబాద్​లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్​ పాల్గొని.. జిల్లాకు వరాల జల్లు కురిపించారు.

తెలంగాణ ఉద్యమంలో మా గూడెంలో.. మా రాజ్యం అని గిరిజనులు పోరాడేవారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో మీరందరూ కలిసి.. తనతో ఉండి పోరాడారని గుర్తు చేసుకున్నారు. కాగజ్​నగర్​, ఆసిఫాబాద్​ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లను సీఎం నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్​ స్పష్టం చేశారు. ఇక్కడ 335 గ్రామ పంచాయతీలకు తక్షణం రూ.10 లక్షల చొప్పున సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలోని 311 పంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున సాయం ప్రకటిస్తున్నామన్నారు.

CM KCR Public Meeting in Asifabad : గతంలో వర్షాకాలం వస్తే చాలు గిరిజనులు అనేక వ్యాధులతో సతమతం అయ్యేవారని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఇప్పుడు ఈ గిరిజన తండాలకు భగీరథ నీళ్లు రావడం వల్ల.. వ్యాధులు రావడం బాగా తగ్గిపోయాయని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు వస్తుంటే వార్ధా నదిపై వంతెన కావాలని ఆదివాసులు కోరారని.. తక్షణమే వంతెనను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల ఆసిఫాబాద్​కు కూడా.. వైద్య కళాశాలను తెచ్చుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆసిఫాబాద్​కు ఐటీఐ కావాలని అడిగారని.. దానిని కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఉన్న నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు.

"పుట్టిన పాప దగ్గర నుంచి ముసలవ్వ వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్​ అంటుంది. ధరణిని తీసేస్తే పైరవీ కారులు, కబ్జాకారులు ఎక్కువ అవుతారు. మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ మోడల్​ కావాలని కోరుకుంటున్నారు. ఆసిఫాబాద్​కు అన్ని విధాలుగా సహకారం అందిస్తాం." - కేసీఆర్​, సీఎం

వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​నే గెలుస్తుంది.. అనుమానం వద్దు

ధరణిని తొలగిస్తామన్న కాంగ్రెస్​కు ఓటు వేస్తారా : వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్​ చెబుతోందని.. ధరణి పోర్టల్​ను తీసేస్తే మళ్లీ పైరవీకారులు, లంచగొండుల రాజ్యం వస్తోందని కేసీఆర్​ అభిప్రాయపడ్డారు. ధరణి ఉండాలా.. వద్దా.. మీరే చెప్పండని ఆసిఫాబాద్​ వాసులను అడిగి సీఎం కేసీఆర్​ తెలుసుకున్నారు. రైతుల కోసమే ధరణి తెచ్చామని చెప్పుకొచ్చారు. ధరణి ఉండడం వల్లే రైతు చనిపోతే వెంటనే అతని ఖాతాలో రూ.5 లక్షలు పడుతున్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణ పథకాలను కావాలని.. పొరుగునే ఉన్న మహారాష్ట్ర వాళ్లు కోరుతున్నారని వెల్లడించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.