ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని వాసవి క్లబ్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు యాద నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో నిర్వహించిన శ్రీనివాస సౌజన్య సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లబ్ కొత్త గవర్నర్గా కలికోట శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు.
సామాజిక సేవ లక్ష్యమే క్లబ్బుల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రెండు వేల క్లబ్బులు ఏటా సుమారు 30 కోట్ల రూపాయలతో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. అందరి ఐక్యతతోనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చూడండి: బాలుడిని కిడ్నాప్ చేసిన బాలుడు... రూ.3 లక్షలు డిమాండ్