ETV Bharat / state

'బీఆర్ఎస్ హయాంలో కుంటుపడ్డ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ గాడినపట్టే బాధ్యత తీసుకున్నాం'

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 7:00 PM IST

Telangana Ministers Review on Prajapalana Program : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో పర్యటిస్తూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని అధికారులతో జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రజాపాలన అమలుపై అధికారులకు, మంత్రుల దిశానిర్దేశం చేశారు. అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల సమస్యల తీర్చే విధంగా కృషి చేయాలని సూచించారు.

Congress Ministers Focus on Prajapalana Program
Telangana Ministers Review on Prajapalana Program

Telangana Ministers Review on Prajapalana Program : సంక్షేమ పథకాల అమలుపై దృష్టిసారించిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతీ నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన దిశగా సాగుతోంది. ఈనెల 28 నుంచి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా ఏర్పాట్లు ప్రారంభించింది.

Congress Ministers Focus on Prajapalana Program : ఇవాళ దీనిపై సమీక్షించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సమస్యలపై సత్వర పరిష్కారమే దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ నెల 28 నుంచి ప్రతీ పల్లె నుంచి నగరం దాకా, అభయ హస్తం పేరిట ప్రభుత్వ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పండగ వాతావరణంలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

వాహనదారులకు శుభవార్త - చలానా రాయితీలకు ప్రభుత్వం అనుమతి

Praja Palana to Solve Ground Level Problems in Telangana : విధ్వంసమైన తెలంగాణను అన్నిరంగాల్లో గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో(Collectorate Office) ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అధికారులు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

ఈ నెల 28 నుంచి జరిగే గ్రామ సభల్లో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో, అభయహస్తం పేరిట జరిగే ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేయటం కానీ, వాళ్ల దరఖాస్తును ఆహ్వానించటం కానీ జరుగుతుంది. దాన్ని అమలుపరిచే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన గ్యారెంటీలకు రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రహదారులు, భవనాలశాఖ మంత్రి

మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు వివిధ స్థాయిల రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొనగా, మంత్రులు ప్రజాపాలన దరఖాస్తుల విధానం, ప్రజలకు అవగాహన కల్పించే అంశాలపై అధికార యంత్రాంగానికి అమాత్యులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) మాట్లాడుతూ, పగబ్బంధీగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగించాలన్నారు.

గత ప్రభుత్వ పాలనలో కొన్ని అవలక్షణాలు వచ్చి అనేక కార్యక్రమాలు కుంటిపడ్డాయి. గత అయిదు సంవత్సరాలలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయింది. వాటినన్నింటినీ కొనసాగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోనియమ్మ ఇచ్చిన గ్యారెంటీలను ఇందిరమ్మ రాజ్యంలో సాఫల్యం చేసుకుందాం. ఖమ్మం జిల్లా ప్రగతి పథంలో మళ్లీ రాష్ట్రంలో నంబర్ 01 గా ఉండటంలో మా అందరి ప్రయత్నం ఉంటుంది.-తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి

గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు ఇందిరమ్మ పాలన అందించి రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలుపుతామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో కుంటుపడ్డ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ గాడినపట్టే బాధ్యత తీసుకుంటామన్నారు.

ఫాక్స్​కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ - 'స్నేహ పూర్వకంగా ఉండే విధానం అవలంభిస్తాం'

Minister Ponguleti on Praja Palana Program : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ గ్యారంటీని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, అమలు చేసి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై(Govt white paper) సమాధానం చెప్పలేని గత ప్రభుత్వ పాలకులు, స్వేదపత్రమంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు.

ఒకే రోజులో దరఖాస్తులు పెట్టాలని ప్రజలు ఆదరాబాదరా పడొద్దు. ప్రభుత్వ లబ్ధి రాదేమోనని ఏ ఒక్క కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం. ఇది మీకోసం మీ గుమ్మం వద్దకే అధికారులు వస్తున్నారు. మొదటి రోజు కాకపోతే రెండో రోజు లేకుంటే ఆరు రోజులు ఉంటుంది కాబట్టి ఏరోజైనా మీ దరఖాస్తు స్వీకరిస్తారు. అప్పుడే ఈ అప్లికేషన్​ల పర్వం ముగుస్తుంది.-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి

'బీఆర్ఎస్ హయాంలో కుంటుపడ్డ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ గాడినపట్టే బాధ్యత తీసుకుంటాం'

జిల్లాలకు ఇంఛార్జీ మంత్రుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.