ETV Bharat / state

'పాలేరు సీటు ఈసారి మాదే.. కాదు నాదే'.. బీఆర్ఎస్-కమ్యూనిస్టుల పొత్తుతో వేడెక్కిన రాజకీయం

author img

By

Published : Mar 26, 2023, 7:42 AM IST

Political Heat Between CPM and BRS parties
Political Heat Between CPM and BRS parties

Political Heat Between CPM and BRS parties on Paleru Seat: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుకు బీఆర్ఎస్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న వేళ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధానంగా పాలేరు అసెంబ్లీలో పోటీపై సీపీఎం-బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారే సీటు తమదంటే తమదంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటం రాజకీయ కాక రేపుతోంది.

పాలేరు సీటుపై సర్వత్రా ఆసక్తి.. ఇరువురు నేతల మాటలతో వేడెక్కిన రాజకీయం

Political Heat Between CPM and BRS parties on Paleru Seat: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్-కమ్యూనిస్టుల పొత్తుపై ఆసక్తి నెలకొంది. మునుగోడు ఉపపోరు నాటి నుంచే ఇరుపక్షాల మధ్య మిత్రబంధం ఏర్పడింది. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత మరింత బలపడింది. ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఖమ్మంనకు వచ్చిన సీఎం కేసీఆర్ వెంట సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని కలిసి పర్యటించారు.

MLA Kandala Responded to Tammineni Comments: ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-సీపీఎం కలిసి నడుస్తాయన్న స్పష్టత వచ్చింది. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం జన చైతన్య యాత్రకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. కూసుమంచిలో జరిగిన సభలో కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలేరు స్థానం అత్యంత ప్రాధాన్యతని వ్యాఖ్యానించారు. పాలేరు స్థానం సీపీఎం పార్టీకి కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గట్టిగా పట్టుబడతామన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తాజాగా దీటుగా స్పందించారు.

ప్రజలు కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయంటూనే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తానే పోటీ చేసి గెలుస్తానన్నారు. ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్‌గా ఉంది. వైఎస్​ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలో నిలుస్తానంటూ ప్రకటించారు. ఈ మార్చ్ నెలాఖరులో పాలేరు నుంచి జిల్లాలో బస్సు యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఈసారి టికెట్ తనదేనంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమాగా ఉన్నారు.

రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున తానే పోటీ చేయాలనే భావనతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరడంతో ఆ పార్టీలో వచ్చే ఎన్నికల్లో టికెట్ పోరు తారాస్థాయికి చేరింది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్-సీపీఎం నేతల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.

సీపీఎం పార్టీ ఒక మాట మీద ఉంటుంది. ఒక మాటకు కట్టుబడి ఉంటుంది. మేము అడిగే మాట నిజం. పాలేరు నియోజకవర్గం మన రాష్ట్రంలోనే ప్రథమ ప్రాధాన్యత సీటుగా ఉన్న మాట నిజం.కేసీఆర్​కు మాకు జరిగే చర్చల్లో సీటు బీఆర్ఎస్​కే అంటే ఊరూరా తిరిగి గెలిపిస్తాం. సీపీఎం పార్టీకి సీటు కేటాయిస్తే కూడా అదే పాటిస్తామని చెప్తున్నాను. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.