ETV Bharat / state

పేదవాడి ఆకలి తీర్చే 'అన్నపూర్ణ' ఇప్పుడు ఖమ్మంలో...

author img

By

Published : Mar 10, 2020, 12:21 PM IST

MINISTER PUVVADA AJAYKUMAR ANNAPURNA CANTEEN STARTED IN KHAMMAM
పేదవాడి ఆకలి తీర్చే 'అన్నపూర్ణ' ఇప్పుడు ఖమ్మంలో...

పేదవాడి ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్​ను ఇప్పడు ఖమ్మంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద ప్రారంభించారు. ఈ క్యాంటీన్​ వల్ల రోజుకు సుమారు వెయ్యి మంది పేదవాళ్ల ఆకలి తీర్చగలుగుతామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ వివరించారు.

ఖమ్మంలో రోజుకు వెయ్యి మంది పేదలకు 5 రూపాయల భోజనం అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ తల్లి కూడలి వద్ద అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ ప్రారంభించారు. నగరంలో మరో మూడు ప్రాంతాల్లో అన్నపూర్ణ క్యాంటీన్​లు ప్రారంభిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర కమిషనర్ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.

పేదవాడి ఆకలి తీర్చే 'అన్నపూర్ణ' ఇప్పుడు ఖమ్మంలో...

ఇదీ చూడండి: ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.