ETV Bharat / state

'ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల నోరు మూసేస్తుంది'

author img

By

Published : Jun 11, 2020, 3:47 PM IST

congress-protest-against-of-arrestes-on-congress-leaders-at-khammam
'ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల నోరు మూసేస్తుంది'

కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఖమ్మంలో ర్యకర్తలు నిరసనకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి... ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల నోరు మూసేస్తుందని ఆరోపించారు.

ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాంగ్రెస్​ నాయకులను గృహనిర్బంధం చేయడం... అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ... ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంజీవ్​రెడ్డి భవన్​ ఎదుట జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా ప్రభుత్వం నోరు మూసేస్తుందంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: కాంగ్రెస్ చలో సచివాలయంపై ఉక్కుపాదం.. నేతల నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.