ETV Bharat / state

karimnagar Accident: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు

author img

By

Published : Jan 31, 2022, 4:28 PM IST

Double Bed room houses to karimnagar car accident victims
రోడ్డు ప్రమాద బాధితులకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు

Double Bed room houses to karimnagar accident victims: కరీంనగర్​లో ఆదివారం జరిగిన కారు బీభత్స ఘటన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు మహిళల కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామని మంత్రి గంగుల కమలాకర్​ పేర్కొన్నారు.

Double Bed room houses to karimnagar accident victims: కరీంనగర్​లో ఆదివారం ఉదయం జరిగిన కారు ప్రమాద ఘటన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు కేటాయించింది. ఘటనలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. వారి కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ ప్రకటించారు. అదే విధంగా రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో 14 కి.మీ విస్తీర్ణంలో రెడ్​ జోన్​ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్లపై ఎవరూ వ్యాపారం చేయకూడదని స్పష్టం చేశారు.

కూలీలపై కారు బీభత్సం

కరీంనగర్​ నగరం నుంచి కోతిరాంపూర్​ వెళ్లే దారిలో.. కరీంనగర్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కన కొందరు కూలీలు కొలిమి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం కావటంతో మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్లు కాల్చుకుంటూ... ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలోనే ఆరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో అటుగా దూసుకొచ్చిన కారు.. అదుపు తప్పి రోడ్డుపక్కన పనులు చేసుకుంటున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని హుటాహుటిన కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.... మరో ముగ్గురు మహిళలు మృతిచెందారు.

నలుగురు అరెస్ట్​

ప్రమాదానికి కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కారు యజమాని రాజేంద్రప్రసాద్​తో పాటు, మరో ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. కారు యజమాని కుమారుడు(మైనర్‌) డ్రైవింగ్​ చేయగా.. అతనితో పాటు వాహనంలో మరో ఇద్దరు మైనర్​ స్నేహితులు ఉన్నారు. ప్రమాదానికి కారణం మైనర్​ డ్రైవింగేనని పోలీసులు పేర్కొన్నారు. మైనర్లకు కార్లు ఇచ్చి ప్రోత్సహించినందుకు యజమానిని సైతం అరెస్టు చేశారు. నలుగురు మృతికి కారణమైనందుకు గాను వారిపై హత్య కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: భూమి రిజిస్ట్రేషన్ కోసం వస్తే.. తుపాకీతో బెదిరించి రూ.40 లక్షలు లాక్కెళ్లాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.