కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తాత్కాలిక స్వీపర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. స్కావెంజర్ స్వీపర్లను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమళ్ల సమ్మయ్య అన్నారు. కొన్నేళ్లుగా కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ... వారికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడంపై ఆయన మండిపడ్డారు. వారికి పింఛను సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః కేసు కొట్టేస్తారా..సెల్టవర్ పైనుంచి దూకేయాలా..!