ETV Bharat / state

'కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాదానం చేయాలి'

author img

By

Published : Sep 3, 2020, 9:55 PM IST

ప్లాస్మాదానం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని కరీంనగర్​ జిల్లా శశాంక అన్నారు. ఈ మేరకు కొవిడ్​ నుంచి కోలుకున్నవారందరూ ప్లాస్మాదానం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్​లో పోస్టర్ విడుదల చేశారు.

poster released in karimnagar collectorate on plasma donation
'కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాదానం చేయాలి'

కొవిడ్​ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకురావాలని కరీంనగర్​ జిల్లా శశాంక కోరారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవనితో సమానమని కలెక్టర్​ తెలిపారు. ప్లాస్మా దాతలందరూ ప్రాణదాతలను ఆయన కొనియాడారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కొవిడ్ దానం చేయాలంటూ కలెక్టర్​ కార్యాలయంలో పోస్టర్​ విడుదల చేశారు.

ప్లాస్మాదానం విషయంలో అపోహలు పెట్టుకోవద్దన్న ఆయన.. కరోనాకు చికిత్స పొంది కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మాను ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేయాలనుకునే వారు.. స్థానిక సఖి కేంద్రంలో లేదా 9490616780 నెంబర్​కు ఫోన్​ చేసి.. తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్​ విజ్ఞప్తి చేశారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.