ETV Bharat / state

MP ARVIND: 'ఈటల రాజేందర్​ వల్లే దళిత బంధు పథకం వచ్చింది'

author img

By

Published : Aug 21, 2021, 7:31 PM IST

దళిత బంధుకు రూ.1.70 లక్షల కోట్లు పెద్ద విషయం కాదన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) .. ఆయుష్మాన్‌ భారత్, ఫసల్‌ బీమా, ఆవాస్‌ యోజన పథకాలకు ఎందుకు ఇన్‌స్టాల్​మెంట్స్‌ కట్టడం లేదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP ARVIND) ప్రశ్నించారు. కేసీఆర్‌ పతనం చూసేంత వరకు నిద్రపోయేది లేదని.. 2023లో తెరాసను ఓడించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

MP ARVIND: 'కేసీఆర్‌ పతనం చూసేంత వరకు నిద్రపోయేది లేదు'
MP ARVIND: 'కేసీఆర్‌ పతనం చూసేంత వరకు నిద్రపోయేది లేదు'

పెట్రోల్​, డీజిల్​లపై పన్నుల రూపేణా రూ.31లు వసూలు చేస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR)​ దానిని తగ్గించి కేంద్రానికి లేఖ రాస్తే.. ఆ లేఖపై తానూ సంతకం చేస్తానని నిజామాబాద్‌ ఎంపీ (nizamabad mp) ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ (huzurabad) నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. హుజూరాబాద్‌లోని ఓ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని ఎక్కడా డ్రాఫ్ట్​ బిల్లులో చెప్పలేదని అర్వింద్ పేర్కొన్నారు. మంత్రి హరీశ్​రావు (minister harish rao) అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రాఫ్ట్‌ బిల్లుపై హుజూరాబాద్‌ బస్టాండ్‌ వద్ద చర్చకు సిద్ధమా అని హరీశ్​రావుకు సవాల్‌ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మారటం సీఎం కేసీఆర్​కు ఇష్టం లేదని అర్వింద్​ ఆరోపించారు. జాతీయ హోదా కల్పిస్తే ఎక్కడ లెక్కలు చెప్పాల్సి వస్తుందోనని భయం పట్టుకుందని విమర్శించారు.

నిర్మల్​ జిల్లా బోధన్‌లో రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇవ్వటం అంటే టెర్రరిస్టులకు సహకరించటమేనని అర్వింద్​ అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్‌పోర్టుల జారీకి సహకరించిన పోలీస్​ అధికారులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దళిత బంధుకు రూ.1.70 లక్షల కోట్లు పెద్ద విషయం కాదన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయుష్మాన్‌ భారత్, ఫసల్‌ బీమా, ఆవాస్‌ యోజన పథకాలకు ఎందుకు ఇన్‌స్టాల్​మెంట్స్‌ కట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ పతనం చూసేంత వరకు నిద్రపోయేది లేదని.. 2023లో తెరాసను ఓడించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

MP ARVIND: 'కేసీఆర్‌ పతనం చూసేంత వరకు నిద్రపోయేది లేదు'

'దళితులకు రూ.10 లక్షలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చినందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన తరగతుల వారందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలి. ఈటల రాజేందర్​ వల్లే ఈ దళితబంధు పథకం వచ్చింది. ఈ పథకానికి ఆయన ఒక్కడికే క్రెడిట్​ దక్కుతుంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్​ ఈ పథకాన్ని తెచ్చారు. ఈ విషయాన్ని హుజూరాబాద్​ ప్రజలు గమనించాలి.' -ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

ఇదీ చూడండి: Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్​పేటకు బిడ్డనే: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.