ETV Bharat / state

హుజూరాబాద్ నేతలందరూ తెరాస వైపే ఉన్నారు: గంగుల

author img

By

Published : May 24, 2021, 1:53 PM IST

Updated : May 24, 2021, 7:39 PM IST

హుజురాబాద్‌ నేతలందరూ తెరాస వైపే ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పార్టీ నేతలను బెదిరిస్తున్నారన్న మాజీమంత్రి ఈటల రాజేందర్​ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

Minister Gangula kamalakar
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

హుజురాబాద్‌ నేతలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట ఉన్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పార్టీ కార్యకర్తలు అమ్ముడుపోతున్నారనే వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని వెల్లడించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

పార్టీ నేతలను భయపెడుతున్నారంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమనే భావన ప్రజాప్రతినిధుల్లో ఉందన్నారు. హుజురాబాద్‌ ప్రజలందరూ తెరాసకు మద్దతుగా నిలుస్తారని వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ నేతలందరూ తెరాస వైపే ఉన్నారు: గంగుల

ఇదీ చూడండి: యాదాద్రిలో శరవేగంగా ఇత్తడి దర్శన వరుసల నిర్మాణం

Last Updated : May 24, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.