ETV Bharat / state

పెరిగిన ధరలను నిరసిస్తూ ఎడ్లబండి ప్రదర్శన

author img

By

Published : Mar 5, 2021, 1:00 PM IST

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ ఎడ్లబండి ప్రదర్శన నిర్వహించారు.

Congress leaders are worried about the immediate reduction in inflated prices on diesel, petrol and cooking gas in karimnagar
పెరిగిన ధరలను నిరసిస్తూ ఎడ్లబండి ప్రదర్శన

డీజీల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు.

కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై శంకరపట్నం వద్ద పెంచిన ధరలను నిరసిస్తూ ఎడ్లబండి ప్రదర్శన నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని ఆందోళనను విరమింపచేశారు.

ఇదీ చదవండి: ఇంటర్ బోర్డు ముట్టడికి భాజపా యువ మోర్చా యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.