ETV Bharat / state

Bandi Sanjay react Karnataka election results : 'ఓటు బ్యాంక్ తగ్గలే.. సీట్లు మాత్రమే తగ్గాయి'

author img

By

Published : May 13, 2023, 8:04 PM IST

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay response to Karnataka election results : గత ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓటింగ్​ శాతం ఈసారీ వచ్చిందని.. ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా? అని బండి సంజయ్​ ప్రశ్నించారు. కర్ణాటకలో వచ్చిన ఫలితం ఇతర రాష్ట్రాల్లో బీజేపీపై ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

Bandi Sanjay response to Karnataka election results : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటుబ్యాంక్ చెక్కుచెదరలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. మతతత్వ రాజకీయాలు చేసి అన్ని పార్టీలు ఏకమై.. అధికారం చేజిక్కించుకున్నాయని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో ఎన్నికల్లోనైనా అక్కడి స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుందని.. ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదని తెలిపారు.

గత ఎన్నికల్లో 36 శాతం ఓటింగ్ పర్సంటేజ్​తో 104 సీట్లు వస్తే.. ఇప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం తగ్గకుండా 36 శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ 38 నుంచి 43 శాతానికి పెరిగిందని.. జేడీఎస్ ఓటింగ్​ షేర్ 20శాతం నుంచి 13 శాతంకు తగ్గిందని తెలిపారు.

జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం నేరుగా కాంగ్రెస్​కు ఓటేయ్యలని ప్రజలకు పిలుపునిచ్చాడని.. ఎన్​డీపీఐ, ఎంఐఎం పార్టీలు కూడా కాంగ్రెస్​కు సపోర్ట్ చేశాయన్నారు. అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయం చేసి బీజేపీని ఎదుర్కొన్నాయన్నారు. ఒక వర్గం ఓట్లతో అధికారం హస్తగతం చేసుకున్నాయన్నారు. భజరంగ్‌దళ్​ను నిషేధిస్తామంటూ.. మతతత్వ రాజకీయాలు చేసింది కాంగ్రెస్ ​పార్టేనని ధ్వజమెత్తారు.

కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్​ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి పెద్దన్న పాత్ర పోషించాడన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌కు కేసీఆర్ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. కర్ణాటక క్యాంప్ రాజకీయాలు సీఎం కేసీఆర్ అండతోనే.. హైదరాబాద్​లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్​కు తెలియకుండా హైదరాబాద్​లో క్యాంప్ రాజకీయాలు నడుస్తాయా అని ప్రశ్నించారు.

జీహెచ్‌ఎంసీలో 4 నుంచి 48 సీట్లకు బలం పెరిగిందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించామని.. తెలంగాణలోనూ బీజేపీ ఓటింగ్‌ శాతం పెరిగినట్లు తెలిపారు. తెలంగాణలో బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపేనని.. ఇక్కడ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే కర్ణాటకలో ప్రకటించినట్లుగా నాలుగు శాతం రిజర్వేషన్‌ సహా, భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని తెలంగాణలో చెప్పగలరా? అని సవాల్​ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ కలిసి పోటీ చేస్తాయి’’ అని బండి సంజయ్‌ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.