ETV Bharat / state

బీభత్సం సృష్టించిన అకాల వర్షం

author img

By

Published : Apr 23, 2019, 1:57 PM IST

బీభత్సం సృష్టించిన అకాల వర్షం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల చెట్లకొమ్మలు విరిగి విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది

బీభత్సం సృష్టించిన అకాల వర్షం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో వడగళ్ల వాన, గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పాల్వంచ, భవానిపేట, పాల్వంచమర్రి, ఇసాయిపేట, మాచారెడ్డి, గజ్యానాయక్‌తండా, కాకులగుట్టతండా, ఘన్‌పూర్‌(ఎం) గ్రామాల్లో గాలితో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఈ అకాల వర్షం వల్ల చెట్లు కూలిపోయాయి. కొమ్మలు విరిగి విద్యుత్‌ స్థంభాలపై పడి తీగలు తెగిపడ్డాయి. అనేక గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. వరి పైరు నేలకొరిగి, మామిడి కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఇవీ చూడండి: "రైతుకు కునుకులేకుండా చేస్తున్న వడగళ్లు"

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.