ETV Bharat / state

కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుంది - ఆ బాధ్యత నాదే : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 1:48 PM IST

Updated : Nov 28, 2023, 4:19 PM IST

KTR Election Campaign in Kamareddy : ఎన్నికల ప్రచారం చివరి రోజున మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్నారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుందని అన్నారు. బీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోను మరోసారి ప్రజలకు వివరించారు.

KTR Road Show At Kamareddy
KTR Election Campaign in Kamareddy

KTR Election Campaign in Kamareddy : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఇవాళ చివరి రోజు అయినందున బీఆర్ఎస్ నేతలు సభలు, కార్నర్ మీటింగ్​లు, రోడ్​షోలతో బీజీగా ఉన్నారు. కేసీఆర్ బరిలో నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (KTR) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడిన ఆయన కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే పూర్తిగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్​కు (KCR) లోకల్,​ నాన్​ లోకల్​ అని ఉంటుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ మినహా.. ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవని గుర్తు చేశారు.

'గజ్వేల్‌ ఒక రోల్‌ మోడల్‌గా ఎదిగింది - 24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నా'

KTR Road Show At Kamareddy : బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. బీజీ కార్మికులకు పింఛను కటాఫ్ డేట్​ను తొలగిస్తామని మాట ఇచ్చారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్నామని తెలిపారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో దేశానికి, తెలంగాణకు మోదీ (Modi) చేసింది శూన్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. బీడీ కార్మికులకు ఇచ్చే ఫించన్​ను దశలవారిగా రూ.5వేలకు పెంచుతామన్న ఆయన.. జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్​కార్డు ఉన్నవారికి అన్నపూర్ణ పథకం కింద అందరికి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు.

55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్​కు రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చిందా : కేటీఆర్

"ఆరు నెలలకో సీఎం మారే మార్పు కావాలా? సిరిసిల్ల ఉరిసిల్లగా మారే మార్పు కావాలా? రైతుబంధు బందయ్యే మార్పు కావాలా? మార్పు కావాలి.. అందుకే తెలంగాణ తెచ్చుకున్నాం. ఒకసారి అందరూ తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నామో అందరు ఆలోచించాలి." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు

KTR Election Campaign : ఒకసారి కేసీఆర్​ కామారెడ్డికి ఎమ్మెల్యే అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే గోదావరి నీళ్లు కామారెడ్డికి తెచ్చే బాధ్యత కేటీఆర్​దని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ చేసే ఆరోపణలు నమ్మవద్దని ప్రజలను సూచించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.

'బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్‌ పార్టీనే - తల తెగిపడినా దిల్లీ నేతలకు తలవంచం'

KTR Road Show At Sircilla : కామారెడ్డి రోడ్​షో అనంతరం మంత్రి కేటీఆర్ సిరిసిల్లాలో నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన ఆయన ఎన్నడు లేని విధంగా చరిత్రలో గుర్తుకుపెట్టుకునేలా సిరిసిల్లాను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి పథకాన్ని, నేతన్నకు బతుకునిచ్చే కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు తీసుకువచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

KTR Election Campaign in Kamareddy కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుంది ఆ బాధ్యత నాదే కేటీఆర్

తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గొంతు నొక్కాలని చూస్తున్నారు : కేటీఆర్

'కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్నారంటే - కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కుమారుడు పుట్టినట్టే'

Last Updated : Nov 28, 2023, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.