Congress flexi issue: కామారెడ్డి జిల్లాలో మార్చి 20న జరగాల్సిన కాంగ్రెస్ మన ఊరు-మన పోరు కార్యక్రమంపై వివాదం నెలకొంది. ఎల్లారెడ్డిలో జరిగే ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కానుండగా.. ఇందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్..
ఇప్పటికే అక్కడ సుభాష్ రెడ్డి, మదన్ మోహన్రావుల మధ్య అధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న కారులో వచ్చిన కొందరు ప్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించగా సుభాష్ రెడ్డి వర్గం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.
కారులో వచ్చిన వారిని కాంగ్రెస్ నాయకులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మంత్రి ఎర్రబెల్లికి మదన్ మోహన్ రావు మేనల్లుడు కావడంతో వివాదం మరింత రాజుకుంది. గత ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన మదన్ మోహన్రావు.. ప్రస్తుతం ఎల్లారెడ్డి అసెంబ్లీ సీటుపై దృష్టి పెట్టడంతో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయి.
ఇదీ చదవండి:జూబ్లీహిల్స్లో కారు బీభత్సం.. పసికందు మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్.!