ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ కార్యకర్తలు.. విద్యార్థులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పక్క దేశాల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా.. రాష్ట్రంలో 50 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడని వాపోయారు. పాఠశాలలు తీసివేయడం వల్ల విద్యార్థులు ఎక్కువ ఉపాధ్యాయులు తక్కువ అవుతారని హెచ్చరించారు. విద్య అందకపోవడం వల్ల అజ్ఞాన అంధకారంలోకి నెట్టేసినట్లవుతుందని గమనించాలని కోరారు. పాఠశాలలను మూసివేసే ఆలోచనను మానుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: జేబీఎస్ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్