ETV Bharat / state

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవు: కేసీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 2:45 PM IST

Updated : Nov 19, 2023, 4:18 PM IST

KCR Praja Ashirvada Sabha in Alampur : వాల్మీకి బోయలను బీసీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని.. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని అలంపూర్, కొల్లాపూర్​లోని ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్.. పాలమూరులో కరవు రాకుండా చూసే బాధ్యత తనదని.. మహబూబ్​నగర్​లోని పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
CM KCR Latest Comments on Congress
KCR Praja Ashirvada Sabha in Alampur

KCR Public Meeting in Alampur ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలి

KCR Praja Ashirvada Sabha in Alampur : ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ నాయకులు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ముఖ్య నాయకులు క్షణం ఖాళీ లేకుండా ఆయా పార్టీ అభ్యర్థుల్లో కార్యకర్తల్లోనూ జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దీపావళి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మూడోసారి సుడిగాలి పర్యటనలు ప్రారంభించారు. రోజుకు మూడు, నాలుగు బహిరంగ సమావేశాల్లో(KCR Public Meetings) పాల్గొంటున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్(BRS) నాయకులు నిర్వహించే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు.

KCR Praja Ashirvada Sabha Jogulamba Gadwal : జరిగే ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్(cm kcr) సూచించారు. ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకూడదని తెలిపారు. గతంలో పాలమూరు నుంచి అధికంగా వలసలు ఉండేవని గుర్తు చేశారు. ప్రస్తుతం పాలమూరులో వచ్చిన మార్పును ప్రజలు గుర్తించాలని అన్నారు. పాలమూరులో కరవు రాకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆర్డీఎస్‌ నుంచి నీళ్లు తరలించుకుని వెళ్తున్నా ఎవరూ మాట్లాడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు పదవుల మీద ఆశతో ఏం మాట్లాడలేదని ఆరోపించారు. ఆర్డీఎస్‌ కాలువల్లో పూడికతీత పనులకు రూ.13 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.

ఆంధ్రోళ్ల బూట్లు మోసిన వ్యక్తి ఇవాళ నన్ను తిడుతున్నాడు : సీఎం కేసీఆర్‌

CM KCR Latest Comments on Congress : బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్‌ పార్టీనేనని.. మరోసారి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కాంగ్రెస్‌ గతంలో పెండింగ్‌లో పెట్టింది కూడా కాంగ్రెస్​నేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ చేసిన అన్యాయాలను సరిదిద్దుకొస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.200 ఉండే పింఛన్‌ను రూ.2వేలకు పెంచామని హర్షం వ్యక్తం చేశారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్‌ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుబంధు వృథా అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రైతులకు 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పారు.

"వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందా? కాంగ్రెస్‌ వస్తే దళారుల, పైరవీకారుల రాజ్యం వస్తుంది. కాంగ్రెస్‌ వస్తే పదేళ్లు మేము చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలి. రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృథా చేస్తున్నానని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్‌ అవసరం లేదని రేవంత్ అన్నారు. రైతుబంధు, 24 గంటల కరెంట్‌ కావాలో.. వద్దో ఆలోచించాలి."- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

KCR Praja Ashirvada Sabha at Kollapur ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవు

KCR Praja Ashirvada Sabha at Kollapur : అనంతరం మహబూబ్​నగర్ జిల్లాలోని కొల్లాపూర్(Kollapur kcr meeting) నియోజకవర్గంలో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఆ సభలో అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను చూడాలని కేసీఆర్ సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణను బలవంతంగా తీసుకెళ్లి.. ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

KCR Praja Ashirvada Sabha : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారని కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి ఉండేదని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించటం ఎప్పుడూ తన గుండెల్లో నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివని అన్నారు. మహబూబ్‌నగర్‌లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామని హామీ ఇచ్చారు.

KCR Comments on Modi : తెలంగాణ వచ్చిన మూడేళ్లలోనే మహబూబ్‌నగర్‌ జిల్లాకు సాగునీరు ఇచ్చామని హర్షం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద నీటి పన్ను ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి పన్ను, బకాయిలు రద్దు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ గెలిస్తే...తెలంగాణ మళ్లీ ఎడారి అవుతుందని కేసీఆర్ విమర్శించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ చెప్పారని మండిపడ్డారు. మీటర్లు పెట్టకపోతే కేంద్రం నిధులు ఆపేస్తామని బెదిరించారని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు రూ.25 వేల కోట్లు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గతంలో నన్ను బాధ పెట్టారు - ఈసారి అలా జరగొద్దు : సీఎం కేసీఆర్

ఈసారి ప్రజలు మోసపోతే - పదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది : సీఎం కేసీఆర్

రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి : కేసీఆర్‌

Last Updated :Nov 19, 2023, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.