ETV Bharat / state

'భూవివాదంతో పురుగులమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం'

author img

By

Published : Jun 20, 2022, 1:25 PM IST

రైతు ఆత్మహత్యాయత్నం
రైతు ఆత్మహత్యాయత్నం

FARMER COMMITS SUICIDE: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ అన్నదాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూమి విక్రయ విషయంలో తలెత్తిన వివాదంలో రైతు సంపత్ రావు బలవన్మరణానికి యత్నించారు. చికిత్స కోసం అతన్ని చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

FARMER COMMITS SUICIDE: భూమి విక్రయ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా,చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పడిదల సంపత్ రావు సంవత్సరం క్రితం అదే గ్రామానికి చెందిన వ్యక్తికి భూమిని విక్రయించారు. ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడంతో డబ్బులు చెల్లించే విషయంలో జాప్యం జరగుతుంది.

పలుసార్లు పెద్ద మనుషుల్లో పంచాయతీలు జరిగాయి. దీనిపై పోలీస్​స్టేషన్​లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తలదూర్చడంతో మరింత వివాదంగా మారింది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన సంపత్ రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయణ్ను చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు చిట్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. అతని ఆత్మహత్యాయత్నానికి అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: రుణం చెల్లించలేదని బ్యానర్‌.. మనస్తాపంతో ఊరొదిలి వెళ్లిన రైతు

చింతన్‌ శిబిర్‌తో కాంగ్రెస్‌లో కదలిక.. సవాళ్లు ఉన్నా మార్పులకు సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.