ETV Bharat / state

భూపాలపల్లి జిల్లాలో ఒక్కరోజే 5,843 మందికి కొవిడ్​ వ్యాక్సిన్​

author img

By

Published : Apr 22, 2021, 10:08 PM IST

రాష్ట్రంలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం 5,843 మందికి కరోనా టీకా వేశారు.

Telangana news
corona vaccine

భూపాలపల్లి జిల్లాలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. 45ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇవాళ 5,843 మందికి వ్యాక్సిన్​ ఇచ్చినట్లు వివరించారు.

అంబట్ పల్లి, ఆజంనగర్, భూపాలపల్లి, రేగొండ, ఘన్పూర్, చెల్పూర్, కాటారం, మొగుళ్లపల్లి, మహా ముత్తారం, ఒడితెల, తాడిచెర్ల, వెలిశాల సామాజిక ఆరోగ్య కేంద్రాలు... చిట్యాల, మహాదేవ్ పూర్, సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్​ కొనసాగుతోందని వెల్లడించారు. ఇవాళ 3,152 మంది ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు, 2,649 మంది 60 ఏళ్లు పైబడిన వారికి టీకా వేశామని తెలిపారు. వ్యాక్సిన్​ తీసుకున్న అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రోగ్రాం అధికారిణి డా.మమతాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జె.సుధార్ సింగ్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్​ కొరతను అధిగమిస్తాం: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.