ETV Bharat / state

HRC Suo moto Case: బతికుండగానే రికార్డుల్లో చంపేశారు..

author img

By

Published : Jan 30, 2022, 4:12 AM IST

HRC Suo moto Case: కొంతమంది సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా ఓ వృద్ధురాలికి పింఛన్​ రాకుండా ఆగిపోయింది. పింఛన్​ కోసం 13 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్నా పట్టించుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తోంది. పింఛన్​ ఆగిపోవడానికి కారణాలు రికార్డుల్లో తాను చనిపోయినట్లు ఉందని పై అధికారులు గుర్తించారు. ఈ విషయంపై పలు దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.

HRC Suo moto Case:  బతికుండగానే రికార్డుల్లో చంపేశారు..
HRC Suo moto Case: బతికుండగానే రికార్డుల్లో చంపేశారు..

HRC Suo moto Case: బతికుండగానే రికార్డుల్లో చంపేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనగామ జిల్లా లింగాల ఘనపురానికి చెందిన వృద్ధురాలు నాగిడి అంజమ్మకి కొంతమంది సిబ్బంది చేసిన ఈ పొరపాటు ఫలితంగా పింఛన్​ రాకుండా ఆగిపోయింది. పింఛన్​ కోసం 13 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్నా పట్టించుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఆమెకు వితంతు పింఛన్​ను మంజూరు చేసింది. 2020 డిసెంబరులో అకస్మాత్తుగా పింఛన్ ఆగిపోయింది. దీంతో ఆమె అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరికి ఇటీవల గ్రీవెన్స్ సెల్​లో కలెక్టర్​కు తన సమస్యను మొరపెట్టుకుంది.

దీంతో తనిఖీ చేయగా అంజమ్మ పింఛన్​ ఆగిపోవడానికి కారణాలు రికార్డుల్లో తాను చనిపోయినట్లు ఉందని పై అధికారులు గుర్తించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పు తమది కాదని మండల పరిషత్ కార్యాలయం అధికారులు, డీఆర్​డీవో పింఛన్​ విభాగం అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ విషయంపై పలు దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వెంటనే ఆ వృద్ధురాలికి తిరిగి పింఛన్​ మంజూరు చేసి... ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకొని మార్చి 23వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్చించాలని జనగామ జిల్లా కలెక్టర్​కి హెచ్​ఆర్​సీ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.