ETV Bharat / state

Rare Fish: మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప

author img

By

Published : Jan 2, 2022, 3:55 PM IST

అరుదైన చేపతో ఫొటోలు
అరుదైన చేపతో ఫొటోలు

Rare Fish: జనగామ జిల్లా పెంబర్తి చెరువులో చేపలు పడుతుండగా జాలరులకు ఓ వింత చేప చిక్కింది. పాములా కనిపించే ఈ మత్స్యాన్ని మలుగ అని పిలుస్తుంటారని, తెలంగాణలో అరుదుగా కనిపిస్తుందని మత్స్యకారులు తెలిపారు.

Rare Fish: చదునైన ఆకారంతో, చూడటానికి పాములా కనిపించే ఓ అరుదైన చేప జనగామ జిల్లా పెంబర్తి చెరువులో మత్స్యకారులకు చిక్కింది. ఆ చేపను చూడగానే నిజంగానే పామే అనుకుంటారు. తెలంగాణలో అరుదుగా కనిపించే ఈ రకం చేపను మలుగ(మలుబెండు) అని పిలుస్తుంటారని మత్స్యకారులు తెలిపారు.

మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప
మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప

మత్స్యకారులకు చిక్కిన ఈ మీనం సుమారు 5 కిలోల బరువు, 5 అడుగుల పొడవు ఉంది. ఈ చేపను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేప వద్ద సెల్ఫీలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.