ETV Bharat / state

Kadiam Srihari vs Thatikonda Rajaiah : 'ఎమ్మెల్యే రాజయ్య.. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే'

author img

By

Published : Jul 10, 2023, 5:35 PM IST

Updated : Jul 10, 2023, 7:00 PM IST

Kadiam Srihari reaction on MLA Rajaiah allegations
Kadiam Srihari reaction on MLA Rajaiah allegations

Kadiam Srihari responded on MLA Rajaiah allegations : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వైద్యుడై ఉండి.. సభ్యత లేకుండా మాట్లాడారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. తన తల్లి కులం, తన కులం గురించి మాట్లాడటం దారుణమన్నారు. సమాజంలోని ప్రతి తల్లిని అవమానించేలా రాజయ్య మాట్లాడారన్న ఆయన.. రాజయ్య ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Kadiam Srihari reaction on MLA Rajaiah allegations : స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రాజయ్య తీరు, ఆరోపణలపై తాజాగా కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజయ్య పార్టీ లైన్‌ దాటి మాట్లాడుతున్నారని.. అయినప్పటికీ తొందరపడొద్దని పార్టీ పెద్దలు తనకు సూచించినట్లు కడియం పేర్కొన్నారు. వాస్తవం చెప్పకపోతే ప్రజలు తనను అపార్థం చేసుకుంటారని అసలు విషయం చెబుతున్నానన్నారు. తాటికొండ రాజయ్య వైద్యుడు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని కడియం ఆక్షేపించారు.

Kadiam Srihari vs Thatikonda Rajaiah : తన కులం, ఆస్తులు, ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధిపై తాటికొండ రాజయ్య అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాజయ్యకు సవాల్‌ విసిరారు. తన అవినీతిని నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానన్న కడియం.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గులాబీ పార్టీ విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

'రాజయ్య పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని పెద్దలు చెప్పారు. వాస్తవం చెప్పకపోతే ప్రజలు నన్ను అపార్థం చేసుకుంటారని అసలు విషయం చెప్తున్నా. రాజయ్య వైద్యుడై ఉండి.. సభ్యత లేకుండా మాట్లాడారు. నా తల్లి కులం, నా కులం గురించి కూడా మాట్లాడటం దారుణం. పిల్లలకు తల్లి కులం కాకుండా తండ్రి కులమే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. తల్లి మాత్రమే సత్యం, తండ్రి అనేది అపోహ అని దారుణంగా మాట్లాడారు. సమాజంలోని ప్రతి తల్లిని అవమానించేలా రాజయ్య మాట్లాడారు. రాజయ్య ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నా అవినీతిని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పార్టీ విజయానికి కృషి చేస్తా.' - ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ఎమ్మెల్యే రాజయ్య ఏమన్నారంటే..? జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజయ్య ఆదివారం శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ను తాను అభివృద్ధి చేశానని శ్రీహరి అంటున్నాడని.. వానాకాలంలో వచ్చే ఆరుద్ర పురుగు లాంటివారిని పట్టించుకోవద్దని అన్నారు. రాజకీయాలను తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటూ ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని కడియం పట్టించుకోలేదని ఆరోపించారు. పర్వతగిరి నుంచి తాను బైండ్ల కులస్థుడినని ఇక్కడికి వచ్చారని.. ఈ మధ్యకాలంలో ఆయన కులంపై చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి తల్లి బీసీ పద్మశాలి అని.. తల్లి పద్మశాలి అనేది నిజమని, తండ్రి అనేది ఊహ అని వ్యాఖ్యానించారు.

Kadiam Srihari reaction on MLA Rajaiah allegations : 'రాజయ్య.. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే'

ఇవీ చూడండి..

కడియం శ్రీహరి, రాజయ్య మధ్య భగ్గుమన్న వర్గపోరు.. బహిరంగంగానే విమర్శలు

'నా దగ్గరున్న ఆధారాలు బయటపెడితే ఇంటి నుంచి కూడా బయటకు రాలేవు'

Last Updated :Jul 10, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.