కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల సంచార జీవనం గడిపేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీసులు సంచార జీవనం కొనసాగించే వారికి వారం రోజులకు సరిపడే కూరగాయలను అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. 110 కుటుంబాలకు కూరగాయలను అందించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'