ETV Bharat / state

'తెలుగుదేశం, జనసేన ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు'

author img

By

Published : Nov 6, 2022, 11:11 AM IST

ysrcp ministers comments on Pawan
ysrcp ministers comments on Pawan

YSRCP MINISTERS ON IPPTAM: జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఇప్పటం గ్రామ పర్యటనపై వైకాపా మంత్రులు స్పందించారు. ప్రజలకు మేలు చేస్తుంటే దానిని రాజకీయం చేయటం సిగ్గుచేటని అన్నారు. అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి తెలుగుదేశం, జనసేన ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు.

YSRCP MINISTERS ON IPPTAM: ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై పవన్‌ కల్యాణ్ రాజకీయం చేయడం తగదని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి తెలుగుదేశం, జనసేన ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు.

ఇప్పటంలో సినిమా ష్యూటింగ్​కు వచ్చినట్టు రావటం, అరవటం ఆయన మాట్లడిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పటంలో అక్రమంగా కట్టుకున్న ప్రహరీ గోడలు, అక్రమాణాలు చేసిన వారికి నోటిసులు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ నోటిసులు ఇచ్చారు. ఈ రోజు అక్కడ ఉన్న ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించి .. అక్కడ ఉన్న ప్రజల అంగికారం తరువాతే చేస్తుంటే.. దాన్ని కూడా రాజకీయం చేయటం సిగ్గు చేటు. - రోజా రాష్ట్ర మంత్రి

పవన్​ కల్యాణ్​ గురించి మాట్లడితే పాపం చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్​లో పెడుతుంటారు. నన్నడిగితే పవన్​ కల్యాణ్​ రాజకీయ నాయకుడు కానే కాదు. - నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి

పవన్​ కల్యాణ్​ ఇప్పటం పర్యటనపై మంత్రి రజని విమర్శులు గుప్పించారు. ప్రజలకు మేలు చేసే దానిపైన రాజకీయలు తగదని అన్నారు. ఇప్పటంలో జరుగుతున్నది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఆమె అన్నారు.

పని కట్టుకుని పవన్​ కల్యాణ్​ ఇప్పటం గ్రామానికి వెళ్లి.. అక్కడ ఉన్న వాళ్లను రెచ్చగొట్టడము, అలజడులు సృష్టించటం మనమంతా చూస్తున్నాం. పవన్​ కల్యాణ్​ ప్రజల సమస్యల కోసమో, ప్రజలకు మేలు చేసే దాని కోసం రాజకీయం చేస్తే దానిని కాదని అనము. కానీ, పవన్​ కల్యాణ్​ కేవలం తెదేపా సంక్షేమం కోసం, చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు. దీనిని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. - విడదల రజని, రాష్ట్ర మంత్రి

తెలుగుదేశం.. జనసేన తమ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు: వైసీపీ మంత్రులు ధ్వజం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.