ETV Bharat / state

'వీరనరసింహారెడ్డి' ప్రీరిలీజ్​ ఈవెంట్​పై ఉత్కంఠ​.. అనుమతి నిరాకరణ

author img

By

Published : Jan 4, 2023, 10:34 PM IST

Masses Of God Veerasimha Reddy: ఈ నెల 6న ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న 'వీరసింహారెడ్డి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఏబీఎన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించాలనుకున్న ఈవెంట్​కు పోలీసులు అనుమతి నిరాకరించారు.

Veerasimha Reddy
వీరనరసింహారెడ్డి

Masses Of God Veerasimha Reddy: మైత్రీ మూవీస్‌ సమర్పణలో.. నందమూరి నటసింహం బాలకృష్ణ, శృతి హాసన్‌ జంటగా నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్​కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 6న ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఏబీఎన్‌ గ్రౌండ్స్​లో నిర్వహిస్తున్నట్లు శ్రేయాస్‌ మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈవెంట్‌ నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రాంతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మలినేని గోపిచంద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. బాలకృష్ణ, శృతి హాసన్​తో పాటు చిత్రం యూనిట్‌ సభ్యులు పాల్గొంటారని.. రెండు గంటల పాటు జరిగే కార్యక్రమంలో 45 నిమిషాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, భారీ సెట్‌ ఏర్పాటు చేసి, నందమూరి అభిమానులకు కనులువిందుగా ఈవెంట్‌ నిర్వహిస్తామని శ్రేయాస్‌ మీడియా ప్రతినిధి శ్రీనివాస్‌ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి పిల్లలు, వృధ్ధులను తీసుకురావద్దని ఆయన కోరారు. తాజాగా పోలీసులు అనుమతి నిరాకరణతో ప్రీ రిలీజ్​ ఈవెంట్​పై ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.